బండారి రాజిరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

బండారి రాజిరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

నాచారం, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గ తొలి శాసనసభ్యులు కీర్తిశేషులు బండారి రాజిరెడ్డి 79వ జయంతి సందర్భంగా నాచారంలోని ఉదయ్ కుమార్ సినీప్లెక్స్ వద్ద ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బండారి రాజిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బండారి రాజిరెడ్డి చూపిన సేవా మార్గాన్ని అనుసరిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. ప్రజా సేవలో ఆయన చూపిన నిబద్ధత తమకు ఆదర్శమని పేర్కొన్నారు.బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ, 2004 మార్చి 14న తన రాజకీయ ప్రస్థానం అప్పటి కాప్రా పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైన బండారి రాజిరెడ్డి ఆశీస్సులతో ప్రారంభమైందని గుర్తుచేశారు. ఆయన నాయకత్వం, మార్గదర్శకం తన రాజకీయ జీవితానికి పునాది వేసిందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె – వనపర్తిలో భారీ నిరసన ర్యాలీ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె – వనపర్తిలో భారీ నిరసన ర్యాలీ
వనపర్తి,ఫిబ్రవరి12(తెలంగాణ ముచ్చట్లు): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సమ్మెకు మద్దతుగా వనపర్తి జిల్లా కేంద్రంలో కార్మిక...
కల్లూరు మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు.
రాధిక చౌరస్తాలో ఆటో కార్మికుల భారీ నిరసన
హరిత ఎంక్లేవ్‌లో మురుగునీటి సమస్యపై స్వర్ణరాజ్ శివమణి పర్యటన
హరిత ఎంక్లేవ్‌లో మురుగునీటి సమస్యపై స్వర్ణరాజ్ శివమణి పర్యటన
బండారి రాజిరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
ఓటమి భయంతో గిఫ్టుల వసూలు?