చర్లపల్లి చెరువుకు త్వరలోనే సుందరీకరణ పనులు పూర్తి చేస్తాం

హైడ్రా కమిషనర్ రంగనాథ్

చర్లపల్లి చెరువుకు త్వరలోనే సుందరీకరణ పనులు పూర్తి చేస్తాం

చర్లపల్లి, ఫిబ్రవరి 13 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గ పరిధి లోని చర్లపల్లి చెరువును సమగ్రంగా అభివృద్ధి చేసి సుందరీకరణ పనులను వేగవంతం చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. శుక్రవారం బుద్ధ భవన్‌లోని తన కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రజా సమస్యలను ఎమ్మెల్యే కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా చర్లపల్లి చెరువు ఆధునీకరణ పనులు ఆలస్యమవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ, చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే విధంగా మౌలిక వసతులు, అందమైన వాకింగ్ ట్రాక్‌లు, లైటింగ్ తదితర సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందజేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు నేమూరి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శివనామస్మరణతో మారుమోగుతున్న నేరడ: శివనామస్మరణతో మారుమోగుతున్న నేరడ:
​ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి13(తెలంగాణ ముచ్చట్లు) మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామ శివాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఏటా అత్యంత వైభవంగా...
నేడు విద్యుత్ లైన్ల మరమ్మతులతో  సరఫరా నిలిపివేత
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
నేరడలో కబడ్డీ పండగ
శివరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం.!
వనపర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. వెల్టూరులో సంబరాలు
33వ వార్డులో కాంగ్రెస్ గెలుపు.. ప్రచారంలో వడ్డే శేఖర్ కీలక పాత్ర