మడిపల్లి–ఎల్కతుర్తి డబుల్ లేన్ రహదారికి రూ.13 కోట్ల ఆమోదం

మడిపల్లి–ఎల్కతుర్తి డబుల్ లేన్ రహదారికి రూ.13 కోట్ల ఆమోదం

ఎల్కతుర్తి, ఫిబ్రవరి 13: (తెలంగాణ ముచ్చట్లు) 

హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మడిపల్లి గ్రామం నుండి ఎల్కతుర్తి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జంక్షన్ వరకు 5 కిలోమీటర్ల పొడవున డబుల్ లేన్ బీటీ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.13 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.
ఈ విషయాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొర్రె మహేందర్ వెల్లడించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రత్యేక చొరవతోనే ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని ఆయన పేర్కొన్నారు. జీవో నం.205ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ శుక్రవారం జారీ చేసినట్లు తెలిపారు.
రహదారి నిర్మాణ పనులను కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ రహదారి పూర్తయితే ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభించడంతో పాటు వ్యాపార, విద్యా, అత్యవసర సేవల రాకపోకలు వేగవంతం అవుతాయని వివరించారు.
ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శివనామస్మరణతో మారుమోగుతున్న నేరడ: శివనామస్మరణతో మారుమోగుతున్న నేరడ:
​ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి13(తెలంగాణ ముచ్చట్లు) మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామ శివాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఏటా అత్యంత వైభవంగా...
నేడు విద్యుత్ లైన్ల మరమ్మతులతో  సరఫరా నిలిపివేత
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
నేరడలో కబడ్డీ పండగ
శివరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం.!
వనపర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. వెల్టూరులో సంబరాలు
33వ వార్డులో కాంగ్రెస్ గెలుపు.. ప్రచారంలో వడ్డే శేఖర్ కీలక పాత్ర