నేడు విద్యుత్ లైన్ల మరమ్మతులతో  సరఫరా నిలిపివేత

చర్లపల్లి, ఫిబ్రవరి 13 (తెలంగాణ ముచ్చట్లు):

చర్లపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని 33/11 కేవీ ఎన్‌ఎన్ కాలనీ సబ్‌స్టేషన్‌కు సంబంధించిన లైన్ల మరమ్మతుల పనులు శనివారం (ఫిబ్రవరి 14) నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో 11 కేవీ విస్టా హోమ్స్ మరియు 11 కేవీ జమ్మిగడ్డ ఫీడర్‌ల పరిధిలో మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 3.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు.విస్టా హోమ్స్, శుభోదయ కాలనీ, శివ సాయి నగర్, లక్ష్మీనరసింహ స్వామి కాలనీ, ఎన్‌ఎన్ కాలనీ, రోడ్ నెంబర్–1, జమ్మిగడ్డ, వెంకట సాయి ఎంక్లేవ్, వీఎన్ రెడ్డి కాలనీ, డి మార్ట్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోతుందని అధికారులు వెల్లడించారు.పనులు పూర్తయ్యిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుందని, వినియోగదారులు సహకరించాలని చర్లపల్లి–2 ఏఈ (ఆపరేషన్) టి. బాలరాజు కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శివనామస్మరణతో మారుమోగుతున్న నేరడ: శివనామస్మరణతో మారుమోగుతున్న నేరడ:
​ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి13(తెలంగాణ ముచ్చట్లు) మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామ శివాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఏటా అత్యంత వైభవంగా...
నేడు విద్యుత్ లైన్ల మరమ్మతులతో  సరఫరా నిలిపివేత
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
నేరడలో కబడ్డీ పండగ
శివరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం.!
వనపర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. వెల్టూరులో సంబరాలు
33వ వార్డులో కాంగ్రెస్ గెలుపు.. ప్రచారంలో వడ్డే శేఖర్ కీలక పాత్ర