తన ఇంటి బిడ్డగా భావించి గెలిపించారు.

ఐదో వార్డు కౌన్సిలర్ హకీమ్ పాషా.

తన ఇంటి బిడ్డగా భావించి గెలిపించారు.

సత్తుపల్లి, ఫిబ్రవరి 14 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఐదో వార్డు కౌన్సిలర్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హకీమ్ పాషా 82 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించిన సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్టా రాగమయి దయానంద్‌కు రుణపడి ఉంటానని తెలిపారు. వార్డు ప్రజలు ప్రతి ఒక్కరూ తన ఇంటి బిడ్డగా భావించి, తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారని, పోటీలో నిలవాలని ప్రోత్సహిస్తూ తనకు అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో వార్డులోని సమస్యలను ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని, ప్రతి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కార దిశగా కృషి చేస్తానని చెప్పారు. తనతో పాటు గెలుపొందిన ఇతర కౌన్సిలర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ
వనపర్తి,ఫిబ్రవరి14(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.జిల్లాలో సాంస్కృతిక,...
విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్‌లో ఘనంగా వార్షిక క్రీడా దినోత్సవం
మల్లికుదుర్లలో గట్టుమల్లికార్జున స్వామి దేవస్థానం నూతన పాలక వర్గ  కమిటీ ఎన్నిక
అమరవీరుల కుటుంబాలకు దేశం ఎప్పటికి ఋణం పడి ఉంటుంది  
కేటీఆర్, హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన పాండాల శివకుమార్ గౌడ్
చిన్న పత్రికలపై చిన్న చూపు తగదు
వనపర్తి మునిసిపాలిటీలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు