అమరవీరుల కుటుంబాలకు దేశం ఎప్పటికి ఋణం పడి ఉంటుంది
వరంగల్ ఎంపి కడియం కావ్య
వరంగల్,ఫిబ్రవరి14(తెలంగాణ ముచ్చట్లు):
పుల్వామా అటాక్ లో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను స్మరించుకుంటూ ఫిబ్రవరి 14ను ‘బ్లాక్ డే’గా పాటించారు. మాజీ కేంద్ర సాయుధ పోలీస్ బలగాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.
హనుమకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిగ్నల్ పాయింట్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో ఎంపీ పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. కొవ్వొత్తుల వెలుగులో జవాన్ల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా డా.కడియం కావ్య మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల త్యాగం, దేశభక్తి ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాయని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు. కొవ్వొత్తుల వెలుగుతో అమరుల జ్ఞాపకాలను స్మరించుకుంటూ వారి అజేయ ఆత్మస్థైర్యానికి వందనం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జి సురేందర్ నాథ్, వైస్ ప్రెసిడెంట్లు ప్రభాకర్, నారాయణ చారి, జనరల్ సెక్రెటరీ ఎలిగేటి శ్రీనివాస్, కోశాధికారి కిషోర్జి, సీఏపీఎఫ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 


Comments