అమరవీరుల కుటుంబాలకు దేశం ఎప్పటికి ఋణం పడి ఉంటుంది  

వరంగల్ ఎంపి కడియం కావ్య 

అమరవీరుల కుటుంబాలకు దేశం ఎప్పటికి ఋణం పడి ఉంటుంది  

వరంగల్,ఫిబ్రవరి14(తెలంగాణ ముచ్చట్లు):

పుల్వామా అటాక్ లో అమరులైన 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను స్మరించుకుంటూ ఫిబ్రవరి 14ను ‘బ్లాక్ డే’గా పాటించారు. మాజీ కేంద్ర సాయుధ పోలీస్ బలగాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.
హనుమకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిగ్నల్ పాయింట్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో ఎంపీ పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. కొవ్వొత్తుల వెలుగులో జవాన్ల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా డా.కడియం కావ్య మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల త్యాగం, దేశభక్తి ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాయని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు. కొవ్వొత్తుల వెలుగుతో అమరుల జ్ఞాపకాలను స్మరించుకుంటూ వారి అజేయ ఆత్మస్థైర్యానికి వందనం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జి సురేందర్ నాథ్, వైస్ ప్రెసిడెంట్లు ప్రభాకర్, నారాయణ చారి, జనరల్ సెక్రెటరీ ఎలిగేటి శ్రీనివాస్, కోశాధికారి కిషోర్జి, సీఏపీఎఫ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. IMG-20260214-WA0103

Tags:

Post Your Comments

Comments

Latest News

మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ
వనపర్తి,ఫిబ్రవరి14(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.జిల్లాలో సాంస్కృతిక,...
విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్‌లో ఘనంగా వార్షిక క్రీడా దినోత్సవం
మల్లికుదుర్లలో గట్టుమల్లికార్జున స్వామి దేవస్థానం నూతన పాలక వర్గ  కమిటీ ఎన్నిక
అమరవీరుల కుటుంబాలకు దేశం ఎప్పటికి ఋణం పడి ఉంటుంది  
కేటీఆర్, హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన పాండాల శివకుమార్ గౌడ్
చిన్న పత్రికలపై చిన్న చూపు తగదు
వనపర్తి మునిసిపాలిటీలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు