కేటీఆర్, హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన పాండాల శివకుమార్ గౌడ్
Views: 4
On
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (తెలంగాణ ముచ్చట్లు):
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్మెల్యే టి హరీష్ రావులను శనివారం వారి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పాండాల శివకుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో నేతలను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఈ నెల 22వ తేదీన చర్లపల్లి డివిజన్ రెడ్డి కాలనీలో నిర్వహించనున్న తన నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.దీనికి స్పందించిన కేటీఆర్, హరీష్ రావులు శుభాకాంక్షలు తెలుపుతూ, కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నేమురి మహేష్ గౌడ్, బుచ్చన్న, శ్రీకాంత్ రెడ్డి, గూడూరి మహేష్ గౌడ్, శంకర్, రమేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
14 Feb 2026 21:59:57
వనపర్తి,ఫిబ్రవరి14(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.జిల్లాలో సాంస్కృతిక,...


Comments