కేటీఆర్, హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన పాండాల శివకుమార్ గౌడ్
Views: 25
On
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (తెలంగాణ ముచ్చట్లు):
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్మెల్యే టి హరీష్ రావులను శనివారం వారి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పాండాల శివకుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో నేతలను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఈ నెల 22వ తేదీన చర్లపల్లి డివిజన్ రెడ్డి కాలనీలో నిర్వహించనున్న తన నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.దీనికి స్పందించిన కేటీఆర్, హరీష్ రావులు శుభాకాంక్షలు తెలుపుతూ, కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నేమురి మహేష్ గౌడ్, బుచ్చన్న, శ్రీకాంత్ రెడ్డి, గూడూరి మహేష్ గౌడ్, శంకర్, రమేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments