గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు

గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు

కీసర, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’ (ఫేజ్–2) కార్యక్రమంలో భాగంగా మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా చీర్యాల ప్రాంతంలోని గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థులకు ప్రత్యేక రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు.కార్యక్రమంలో జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర పీఎస్ ఇన్‌స్పెక్టర్ ఆర్కపల్లి అంజనేయులు, జవహర్‌నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్, ఎస్‌ఐ హరిప్రసాద్ పాల్గొన్నారు.అధికారులు మాట్లాడుతూ వేగ నియంత్రణ ప్రాముఖ్యత, లేన్ క్రమశిక్షణ, చిన్న రోడ్ల నుండి ప్రధాన రహదారుల్లోకి ప్రవేశించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భారీ వాహనాల డ్రైవర్ల బాధ్యతలపై వివరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడపడం మరియు డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు.యువత రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించి, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు కూడా అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20260227-WA0069

Tags:

Post Your Comments

Comments

Latest News

రాష్ట్రంలోనే తొలిసారి ‘ఇందిరమ్మ–రేవంత్ రెడ్డి కాలనీ’ రాష్ట్రంలోనే తొలిసారి ‘ఇందిరమ్మ–రేవంత్ రెడ్డి కాలనీ’
- కొత్తూరులో 67 ఇళ్లతో సామూహిక గృహప్రవేశాలు.- పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి ఆధునిక వసతులతో నిర్మాణం. సత్తుపల్లి, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):  సత్తుపల్లి మండలం...
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో రామిడి విజయ్ రెడ్డి పాల్గొన్నారు
విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 95వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ
చికిత్స పొందుతూ ప్రమీల రాణి మృతి
గ్రామీణాభివృద్ధి–మహిళా సాధికారతకు ప్రాధాన్యం.
న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరం
మానవ మనుగడకు సైన్స్ కీలకం: ఎమ్మెల్యే మట్టా రాగమయి.