తాటిపాముల కుంటివాని తాండలో గండదీపం–గరుడస్తంభం భూమిపూజ
వనపర్తి,ఫిబ్రవరి27(తెలంగాణ ముచ్చట్లు):
శ్రీరంగాపూర్ మండలం పరిధిలోని తాటిపాముల గ్రామం కుంటివాని తాండలో శుక్రవారం గండదీపం, గరుడస్తంభం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. వార్డు సభ్యుడు లోక్యా నాయక్ ఆహ్వానం మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్, గ్రామ సర్పంచ్ శిరీష మధు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తాండలో చేపడుతున్న అభివృద్ధి పనులు అభినందనీయమని వారు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.అనంతరం రాజు నాయక్, బరికి చంద్రయ్య గృహప్రవేశం చేసిన సందర్భంగా వారి ఇళ్లను సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో తాండ వార్డు సభ్యుడు లోక్యా నాయక్, మాజీ సర్పంచ్ సత్యం యాదవ్, వార్డు సభ్యులు వెంకటేష్, సురేష్, చంద్రాయుడు, బుచ్చన్న, మాజీ ఉపసర్పంచ్ బాలరాజు, కుమ్మరి ఆంజనేయులు, భాస్కర్, రాములు, హరికృష్ణ, నాగరాజు, రాజు నాయక్, డా. నారాయణ్, సుధాకర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.


Comments