ఆగారంలో రెడ్ల కుంట చెరువు తూములను పరిశీలించిన అధికారులు

ఆగారంలో రెడ్ల కుంట చెరువు తూములను పరిశీలించిన అధికారులు

త్వరలో మరమ్మతు పనులు ప్రారంభం

-- నీటిపారుదల శాఖ అధికారులు 

ఖిల్లా ఘనపూర్,ఫిబ్రవరి27(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా ఘనపూర్ మండలం పరిధిలోని ఆగారం గ్రామంలో ఉన్న రెడ్ల కుంట చెరువు తూములను నీటి పారుదల శాఖ అధికారులు పరిశీలించారు. చెరువు తూముల స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన మరమ్మతు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.చెరువులో నీటి నిల్వ మరియు సాగునీటి సరఫరాకు తూములు కీలకమని అధికారులు పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తూముల బలపరిచే పనులతో పాటు అవసరమైన చోట పునర్నిర్మాణ చర్యలు చేపడతామని వెల్లడించారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకుడు మున్నూరు జయాకర్, గ్రామ సర్పంచ్ నర్సమ్మ, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. చెరువు పనులు త్వరగా ప్రారంభించాలని రైతులు కోరగా, అధికారులు సానుకూలంగా స్పందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాష్ట్రంలోనే తొలిసారి ‘ఇందిరమ్మ–రేవంత్ రెడ్డి కాలనీ’ రాష్ట్రంలోనే తొలిసారి ‘ఇందిరమ్మ–రేవంత్ రెడ్డి కాలనీ’
- కొత్తూరులో 67 ఇళ్లతో సామూహిక గృహప్రవేశాలు.- పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి ఆధునిక వసతులతో నిర్మాణం. సత్తుపల్లి, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):  సత్తుపల్లి మండలం...
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో రామిడి విజయ్ రెడ్డి పాల్గొన్నారు
విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 95వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ
చికిత్స పొందుతూ ప్రమీల రాణి మృతి
గ్రామీణాభివృద్ధి–మహిళా సాధికారతకు ప్రాధాన్యం.
న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరం
మానవ మనుగడకు సైన్స్ కీలకం: ఎమ్మెల్యే మట్టా రాగమయి.