మహా శివరాత్రి సందర్భంగా శివసాయి నగర్ శివాలయంలో భక్తుల రద్దీ
కుషాయిగూడ, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాప్రాసర్కిల్ కుషాయిగూడ డివిజన్ పరిధిలోని శివసాయి నగర్ శివాలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకం, మహామంగళహారతి కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించబడ్డాయి.
మహాశివరాత్రి ఉపవాస దీక్షలో ఉన్న భక్తుల కోసం కనకదుర్గమ్మ ట్రస్ట్ సభ్యులు సేవా కార్యక్రమాలు
చేపట్టారు. ట్రస్ట్ సభ్యులు నాగరాజు, సుబ్బయ్య, వేణు, భాస్కర్, శ్రీకాంత్, శ్రీను, సురేష్ తదితరుల ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చిన భక్తులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ మహా శివరాత్రి ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పర్వదినమని, భక్తుల సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమం శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.


Comments