మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో భక్తుల రద్దీ
ప్రముఖుల దర్శనం
కీసర గుట్ట , ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు):
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకు ని మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట శ్రీ భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ ఉప్పొంగింది. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉండగా, దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.ఈ సందర్భంగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రోడ్లు-భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులతో కలిసి వారు ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, కీసర నుండి గుట్ట వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. భక్తులకు మెరుగైన రవాణా,
మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.


Comments