మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు

మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు

మేడ్చల్ జిల్లా, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు):

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకు ని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్  కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంను దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ఎంపీకి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో మాట్లాడిన ఆయన, మహాశివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
అలాగే ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన త్రాగునీరు, క్యూలైన్లు, పార్కింగ్, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లను ఎంపీ ఈటల రాజేందర్ స్వయంగా పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.IMG-20260215-WA0073

Tags:

Post Your Comments

Comments

Latest News

సాహిత్య సంగ్రామంలో కట్టెకోలకు సత్కారం సాహిత్య సంగ్రామంలో కట్టెకోలకు సత్కారం
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 15(తెలంగాణ ముచ్చట్లు) రామదాసు సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులోని కూకట్ పల్లిలో నిర్వహించిన సాహిత్య సంగ్రామంలో ఖమ్మం నగరానికి చెందిన...
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో భక్తుల రద్దీ 
కాప్రా లో శివ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహణ
మహాశివరాత్రి సందర్భంగా శివ సాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు
సోక్రటీస్ వర్ధంతి – గెలీలియో జయంతి సందర్భంగా సంస్మరణ సభ
నేరేడ శివయ్య సన్నిధిలో  డిప్యూటీ సీఎం భట్టి దంపతుల ప్రత్యేక పూజలు..
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు