మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు
మేడ్చల్ జిల్లా, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు):
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకు ని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంను దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ఎంపీకి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో మాట్లాడిన ఆయన, మహాశివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
అలాగే ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన త్రాగునీరు, క్యూలైన్లు, పార్కింగ్, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లను ఎంపీ ఈటల రాజేందర్ స్వయంగా పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.


Comments