శివరాత్రి వేళ 15వ బెటాలియన్లో మహా అన్నదానం.
- కమాండెంట్ అంజయ్య చేతుల మీదుగా ప్రారంభం.
- సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్తో కలిసి శ్రీకారం.
సత్తుపల్లి, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు):
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 15వ బెటాలియన్ పరిధిలోని బి. గంగారం వద్ద ఉన్న శ్రీ భ్రమరాంబికాదేవి సమేత స్వయంభూ మల్లిఖార్జున స్వామి వారి ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ ఏ. అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు, బెటాలియన్ సిబ్బంది కుటుంబ సభ్యులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కమాండెంట్ ఏ. అంజయ్య, బేతుపల్లి సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్(అమ్ములు)తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండెంట్ అంజయ్య మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడమే కాకుండా సేవాభావాన్ని మరింత బలపరుస్తాయని తెలిపారు.
కార్యక్రమంలో పరిపాలన అధికారి అశోక్, ఆర్.ఐలు వై.ఆర్.ఎస్. నారాయణ, జి. గోపాలరావు, పి. ఉదయకుమార్, ఆర్.ఎస్.ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


Comments