శివరాత్రి వేళ 15వ బెటాలియన్‌లో మహా అన్నదానం.

శివరాత్రి వేళ 15వ బెటాలియన్‌లో మహా అన్నదానం.

- కమాండెంట్ అంజయ్య చేతుల మీదుగా ప్రారంభం.
- సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి శ్రీకారం.

సత్తుపల్లి, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు):

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 15వ బెటాలియన్ పరిధిలోని బి. గంగారం వద్ద ఉన్న శ్రీ భ్రమరాంబికాదేవి సమేత స్వయంభూ మల్లిఖార్జున స్వామి వారి ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ ఏ. అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు, బెటాలియన్ సిబ్బంది కుటుంబ సభ్యులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కమాండెంట్ ఏ. అంజయ్య, బేతుపల్లి సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్‌(అమ్ములు)తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండెంట్ అంజయ్య మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడమే కాకుండా సేవాభావాన్ని మరింత బలపరుస్తాయని తెలిపారు.
కార్యక్రమంలో పరిపాలన అధికారి అశోక్, ఆర్‌.ఐలు వై.ఆర్‌.ఎస్‌. నారాయణ, జి. గోపాలరావు, పి. ఉదయకుమార్, ఆర్‌.ఎస్‌.ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.IMG-20260215-WA0015

Tags:

Post Your Comments

Comments

Latest News

సాహిత్య సంగ్రామంలో కట్టెకోలకు సత్కారం సాహిత్య సంగ్రామంలో కట్టెకోలకు సత్కారం
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 15(తెలంగాణ ముచ్చట్లు) రామదాసు సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులోని కూకట్ పల్లిలో నిర్వహించిన సాహిత్య సంగ్రామంలో ఖమ్మం నగరానికి చెందిన...
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో భక్తుల రద్దీ 
కాప్రా లో శివ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహణ
మహాశివరాత్రి సందర్భంగా శివ సాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు
సోక్రటీస్ వర్ధంతి – గెలీలియో జయంతి సందర్భంగా సంస్మరణ సభ
నేరేడ శివయ్య సన్నిధిలో  డిప్యూటీ సీఎం భట్టి దంపతుల ప్రత్యేక పూజలు..
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు