సత్తుపల్లి రాజకీయాల్లో క్షణక్షణం ఉత్కంఠ.!
- మున్సిపల్ పీఠానికి తుదివేళ.
- నేడు (సోమవారం) తేలనున్న అధికారం.
- సోమవారం కవర్ ఓపెన్.
- ఎవరి పేరు బయటపడుతుందో ఉత్కంఠ..
- పట్టణం మొత్తం ఎదురుచూపు.
- వేడెక్కిన రాజకీయ వాతావరణం.
సత్తుపల్లి, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి రాజకీయాల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మున్సిపల్ పీఠం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో నేడు (సోమవారం) తేలనుంది. అధికారికంగా కవర్ ఓపెన్ చేయనున్న నేపథ్యంలో పట్టణమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. పీఠం కోసం పోటీ పడ్డ వర్గాలు చివరి క్షణం వరకు వ్యూహాలు రచించగా, నాయకుల మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి. కార్యకర్తలు, ప్రజలు తమ తమ అంచనాలు వేస్తూ రేపటి నిర్ణయంపై దృష్టి సారించారు. నేడు (సోమవారం) కవర్ ఓపెన్ అయ్యే క్షణమే సత్తుపల్లి రాజకీయ దిశను నిర్ణయించనుంది. ఎవరి పేరు ప్రకటించబడుతుందో, ఎవరు అధికార పీఠాన్ని అధిరోహిస్తారో తెలియనున్న ఆ క్షణం కోసం పట్టణం మొత్తం ఆత్రుతగా ఎదురుచూస్తోంది.


Comments