సత్తుపల్లి రాజకీయాల్లో క్షణక్షణం ఉత్కంఠ.!

సత్తుపల్లి రాజకీయాల్లో క్షణక్షణం ఉత్కంఠ.!

- మున్సిపల్ పీఠానికి తుదివేళ.
- నేడు (సోమవారం) తేలనున్న అధికారం.
- సోమవారం కవర్ ఓపెన్.
- ఎవరి పేరు బయటపడుతుందో ఉత్కంఠ..
- పట్టణం మొత్తం ఎదురుచూపు.
- వేడెక్కిన రాజకీయ వాతావరణం.

సత్తుపల్లి, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి రాజకీయాల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మున్సిపల్ పీఠం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో నేడు (సోమవారం) తేలనుంది. అధికారికంగా కవర్ ఓపెన్ చేయనున్న నేపథ్యంలో పట్టణమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. పీఠం కోసం పోటీ పడ్డ వర్గాలు చివరి క్షణం వరకు వ్యూహాలు రచించగా, నాయకుల మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి. కార్యకర్తలు, ప్రజలు తమ తమ అంచనాలు వేస్తూ రేపటి నిర్ణయంపై దృష్టి సారించారు. నేడు (సోమవారం) కవర్ ఓపెన్ అయ్యే క్షణమే సత్తుపల్లి రాజకీయ దిశను నిర్ణయించనుంది. ఎవరి పేరు ప్రకటించబడుతుందో, ఎవరు అధికార పీఠాన్ని అధిరోహిస్తారో తెలియనున్న ఆ క్షణం కోసం పట్టణం మొత్తం ఆత్రుతగా ఎదురుచూస్తోంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

సాహిత్య సంగ్రామంలో కట్టెకోలకు సత్కారం సాహిత్య సంగ్రామంలో కట్టెకోలకు సత్కారం
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 15(తెలంగాణ ముచ్చట్లు) రామదాసు సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులోని కూకట్ పల్లిలో నిర్వహించిన సాహిత్య సంగ్రామంలో ఖమ్మం నగరానికి చెందిన...
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో భక్తుల రద్దీ 
కాప్రా లో శివ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహణ
మహాశివరాత్రి సందర్భంగా శివ సాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు
సోక్రటీస్ వర్ధంతి – గెలీలియో జయంతి సందర్భంగా సంస్మరణ సభ
నేరేడ శివయ్య సన్నిధిలో  డిప్యూటీ సీఎం భట్టి దంపతుల ప్రత్యేక పూజలు..
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు