మార్చి 06న భద్రాచలం నందు శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జన్మదిన వేడుకలు...
ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు.
భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 27, (తెలంగాణ ముచ్చట్లు):
లంబాడీల గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు సమక్షంలో మార్చి 06 శుక్రవారం రోజున ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో భోగ్ బండారో కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. శుక్రవారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు క్యాంప్ కార్యాలయంలో లంబాడీల జేఏసీ నాయకులతో కలిసి మీటింగ్ ఏర్పాటు చేసినారు కొన్ని అనివార కారణాలవల్ల ఫిబ్రవరి 28 న జరగవలసిన జయంతి ఉత్సవాల భోగ్ బండారో కార్యక్రమం మార్చి 06 న మార్చటం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి భద్రాచలం నియోజకవర్గం లోని గిరిజన లంబాడీలు, మరియు సోదర సోదరీమణులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు లంబాడీల ఉద్యోగులు, లంబాడీల కుల పెద్దలు, యువతీ యువకులు, మేధావులు, రాజకీయ ప్రముఖులు, పుర ప్రముఖులు, విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో డీ.హరిచంద్ర నాయక్, లకావత్ వెంకటేశ్వర్లు, భూక్యా రంగా, బి బన్సీలాల్, బి గోవింద్, బి మదర్ నాయక్, టి బాలు నాయక్, టి మోహన్ లాల్ ,
బి తార చంద్, బి కిషన్, బి గోపాల్ కృష్ణ, డి సైదులు, జె ఈశ్వర్, జి రాందాస్, భూక్యా సాయి కౌశిక్, బి బిచ్చ, తదితరులు పాల్గొన్నారు.


Comments