బాబా నగర్‌లో డ్రైనేజీ సమస్యలపై పర్యటించిన సాయిజెన్ శేఖర్

బాబా నగర్‌లో డ్రైనేజీ సమస్యలపై పర్యటించిన సాయిజెన్ శేఖర్

నాచారం, ఫిబ్రవరి 25 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ డివిజన్ పరిధిలోని బాబా నగర్‌లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిశీలించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ పర్యటించారు. చాలా కాలంగా డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, సమస్యను పరిష్కరించకుండానే కొత్త సిమెంట్ రోడ్లు వేశారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా సమస్య ఉన్న వీధుల్లో కాలనీవాసులతో కలిసి పరిశీలించిన సాయిజెన్ శేఖర్, డ్రైనేజీ లైన్లను మ్యాన్‌హోల్ టు మ్యాన్‌హోల్ డీప్ క్లీనింగ్ చేసి సిల్ట్ పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా అడ్డంకులు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఈ విషయమై సంబంధిత డీజీఎం వేణుగోపాల్‌కు ఫోన్ ద్వారా తెలియజేసినట్లు పేర్కొన్నారు.
డీప్ క్లీనింగ్ చేసినా సమస్య కొనసాగితే అదనంగా ఒక అడుగు డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేయడానికి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. కార్యక్రమంలో బాబా నగర్ కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను వివరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారులను విస్మరించినందుకే కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పరిమితం ఉద్యమకారులను విస్మరించినందుకే కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పరిమితం
ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిన రేవంత్ రెడ్డి ఇంకా పదేళ్లు సిఎంగా  కొనసాగుతారు – తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి హైదరాబాద్,ఫిబ్రవరి25(తెలంగాణ ముచ్చట్లు):...
అగ్రకుల కులోన్మాదం అరికట్టకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది
నాగవరం ఉన్నత పాఠశాలలో ‘ఆర్ట్ ఆఫ్ ఆన్సరింగ్’ పై మోటివేషన్ కార్యక్రమం
మేఘన్న అభయ హస్తం – బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
పిల్లల ఆహారంలో నిర్లక్ష్యం అస్సలు వద్దు
ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రతినిధులు ఎంపీ ఈటల ను మర్యాదపూర్వకంగా కలిసారు
వల్లభాపూర్‌లో కల్లు గీత సంఘం ఎన్నికలు విజయవంతం