నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
అడ్డాకల్,ఫిబ్రవరి22(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి నియోజకవర్గం అడ్డాకల్ మండలానికి చెందిన ఆంజనేయులు – లక్ష్మీ దంపతుల కుమార్తె ఉమా నిశ్చితార్థ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిశ్చితార్థం అనే తంతు జరిగిందంటే సగం పెళ్లి జరిగినట్లేనని పెద్దలు భావిస్తారని తెలిపారు.ప్రస్తుతం నిశ్చితార్థ వేడుకను కూడా పెళ్లి వేడుకతో సమానంగా ఘనంగా నిర్వహించడం శుభ సూచకమని అన్నారు.ఇలాంటి శుభకార్యాలు కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించిన పెళ్లికూతురు తల్లిదండ్రులు ఆంజనేయులు, లక్ష్మీ దంపతులను ఎమ్మెల్యే అభినందించారు.కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


Comments