రాష్ట్ర స్థాయిలో మెరిసిన వేలేరు ఎస్సై అజ్మీర సురేష్ కుమార్
కాంస్య పతకం సొంతం
Views: 3
On
వేలేరు, ఫిబ్రవరి 21 : (తెలంగాణ ముచ్చట్లు)
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ వేదికగా గత మూడు రోజులుగా నిర్వహించిన 4వ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో వేలేరు ఎస్సై అజ్మీర సురేష్ కుమార్ అద్భుత ప్రతిభ కనబరిచి ఓపెన్ క్యాటగిరీలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.
రాష్ట్రం నలుమూలల నుండి పాల్గొన్న ప్రతిభావంతులైన పోలీస్ క్రీడాకారులతో కఠిన పోటీ మధ్య తన శక్తి, సామర్థ్యం, పట్టుదలతో పోరాడి విజయం సాధించడం విశేషం. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలో సేవలందిస్తూ, క్రీడలలోనూ తన సత్తా చాటడం ద్వారా సురేష్ కుమార్ వేలేరు మండలానికి గర్వకారణంగా నిలిచారు.
ఈ విజయంతో వేలేరు పోలీస్ స్టేషన్ ప్రతిష్ట మరింత పెరిగింది. సహచర అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికప్రజలు ఆయనను ఘనంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
21 Feb 2026 22:02:24
హనుమకొండ,ఫిబ్రవరి 21(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా గిరిజన భవనంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. సేవాలాల్ ఉత్సవ...


Comments