మణిగిళ్ల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం

మణిగిళ్ల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం

పెద్దమందడి,ఫిబ్రవరి18(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పరీక్షల నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన స్టడీ అవర్స్‌లో భాగంగా సాయంత్రం అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ నూతన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ , ఉపాధ్యాయులు జానయ్య, ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందజేశారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్‌తో పాటు గ్రామ పెద్దలు రాంరెడ్డి, ఎం. బుచ్చన్న, వెంకటయ్య, శ్రీకాంత్ రెడ్డి, ఉప్పురి సాయికుమార్ పాల్గొన్నారు.విద్యార్థులు, గ్రామస్తులు కార్యక్రమాన్ని అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలి పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలి
పెద్దమందడి,ఫిబ్రవరి18(తెలంగాణ ముచ్చట్లు): పదవి విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో సహజమని, అనంతరం శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసి సమాజానికి తోడ్పాటు అందించే విధంగా ముందుకు సాగాలని...
ఖిల్లా ఘనపూర్ లో పలు శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
సిఆర్పిల ఆత్మీయ సమ్మేళనానికి పిలుపు.!
నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి ఎంపీ ఈటల రాజేందర్ సన్మానం
ఘనంగా ఆలిండియా ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు
మణిగిళ్ల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం