గిరిజనులకు కంటపడ్డ శివయ్య.!
గట్టుగూడెం గుట్టపై శివలింగం దర్శనం.
సత్తుపల్లి, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం గ్రామ చివరలోని గుట్టపై శివలింగం వెలిసినట్లు గిరిజనులు గుర్తించారు. ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు చేరడంతో భక్తులు పెద్ద సంఖ్యలో దేవుణ్ణి దర్శించుకోవడానికి గుట్టపైకి వెళ్లేందుకు తరలివచ్చారు. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు భక్తులను గుట్టపైకి వెళ్లనీయక ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామస్థులు హిందూ సంఘాల నాయకులకు సమాచారం అందించారు.
గ్రామస్థులకు అండగా నిలిచిన బీజేపీ మరియు హిందూ సంఘాల నాయకులు గుట్టపైకి చేరుకుని శివయ్యను దర్శించుకుని పాలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా తాము అండగా ఉంటామని, దేవుడి విషయంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే సహించబోమని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి, సీనియర్ నాయకులు విశ్వేశ్వరరావు, రామాదండు మహిళ అధ్యక్షురాలు నాగవర్ధనమ్మ, చారి, మల్లేశ్, గ్రామస్థులు మరియు భక్తులు పాల్గొన్నారు.


Comments