మణిగిళ్లలో మార్నింగ్ వాక్ సందర్భంగా నీటి సమస్యలపై సమీక్ష

మణిగిళ్లలో మార్నింగ్ వాక్ సందర్భంగా నీటి సమస్యలపై సమీక్ష

మిషన్ భగీరథ నీటి సరఫరాపై ఇంటింటి పరిశీలన

-- సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్

పెద్దమందడి, ఫిబ్రవరి16(తెలంగాణ ముచ్చట్లు): 

పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామంలో ఉదయం నిర్వహించిన మార్నింగ్ వాక్ సందర్భంగా గ్రామ నూతన సర్పంచ్ పలుసు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ నీటి సరఫరాపై ప్రత్యేకంగా పరిశీలించారు.రాబోయే వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందుతున్నదా లేదా అనే అంశాన్ని తెలుసుకున్నారు.ఇళ్ల వద్ద నీటి సరఫరా విధానం, ఒత్తిడి సమస్యలు తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు.నీటి సరఫరా అందని ఇళ్లకు ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేసి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.కంట్రోల్ వాల్వులు సరిగా బిగించుకుంటే నీటి సమస్య తగ్గుతుందని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముప్పూరి గణేష్ కుమార్‌తో పాటు గ్రామ పెద్దలు, యువకులు పోతుల రామిరెడ్డి, ఎస్ రాములు, పోతుల ప్రతాప్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, బుచ్చన్న, గొంది రామకృష్ణారెడ్డి, దానేలు కొములయ్య, బాలరాజ్, మందడి శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి, బి.కె. నాయుడు, సుంచరమోని తిరుపతి, ముప్పూరి సాయికుమార్, సింగం రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం
మల్లాపూర్, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు) ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్‌టిఆర్ నగర్ బండబావి కమ్యూనిటీ హాల్‌లో పరమేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
మూడుసార్లు వార్డు నెంబర్ గా గెలుపొందిన... మాదినేని సునీత  
వైరాను మోడల్ మున్సిపాలిటీగా   తీర్చిదిద్దుతా  బాధ్యత నాదే..
ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ
కాప్రా సర్కిల్‌లోని శ్రీ తులజా భవాని ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా
వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవిని కలిసిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు
పేద విద్యార్థికి అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం