మూడుసార్లు వార్డు నెంబర్ గా గెలుపొందిన... మాదినేని సునీత  

హ్యాట్రిక్ విజయం ఆమెపై ప్రశంసల జల్లు..

మూడుసార్లు వార్డు నెంబర్ గా గెలుపొందిన... మాదినేని సునీత  

ఖమ్మం బ్యూరో,ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు) 

వైరా మున్సిపాలిటీ తోపాటు, వైరా మేజర్ గ్రామపంచాయితీలో వరుసగా మూడుసార్లు  వేర్వేరు వార్డుల్లో పోటీ చేసి ఓ మహిళ కౌన్సిలర్ గా గెలుపొందింది. ఆమె మూడు ఎన్నికల్లో వరుసగా గెలుపొంది  హ్యాట్రిక్ విజయం సాధించింది. ఆమె మాదినేని సునీత. వైరా మేజర్ గ్రామపంచాయితీ గా ఉన్నప్పుడు  6వ వార్డులో  సునీత గెలుపొందారు. అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ తరపున  2018 మున్సిపాలిటీ ఎన్నికల్లో 5వ వార్డు నుంచి విజయ డంకా మోగించారు. ప్రస్తుతం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆమె 12వార్డు నుంచి మరోసారి కౌన్సిలర్ గా గెలుపొందారు. ఆమె విజయంలో భర్త మాదినేని ప్రసాద్ కీలకపాత్ర పోషించారు. వైరా మున్సిపాలిటీ చరిత్రలో వరుసగా  మూడోసారి విజయం సాధించిన మాదినేని సునీతకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం
మల్లాపూర్, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు) ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్‌టిఆర్ నగర్ బండబావి కమ్యూనిటీ హాల్‌లో పరమేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
మూడుసార్లు వార్డు నెంబర్ గా గెలుపొందిన... మాదినేని సునీత  
వైరాను మోడల్ మున్సిపాలిటీగా   తీర్చిదిద్దుతా  బాధ్యత నాదే..
ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ
కాప్రా సర్కిల్‌లోని శ్రీ తులజా భవాని ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా
వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవిని కలిసిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు
పేద విద్యార్థికి అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం