మూడుసార్లు వార్డు నెంబర్ గా గెలుపొందిన... మాదినేని సునీత
హ్యాట్రిక్ విజయం ఆమెపై ప్రశంసల జల్లు..
Views: 5
On
ఖమ్మం బ్యూరో,ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు)
వైరా మున్సిపాలిటీ తోపాటు, వైరా మేజర్ గ్రామపంచాయితీలో వరుసగా మూడుసార్లు వేర్వేరు వార్డుల్లో పోటీ చేసి ఓ మహిళ కౌన్సిలర్ గా గెలుపొందింది. ఆమె మూడు ఎన్నికల్లో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించింది. ఆమె మాదినేని సునీత. వైరా మేజర్ గ్రామపంచాయితీ గా ఉన్నప్పుడు 6వ వార్డులో సునీత గెలుపొందారు. అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ తరపున 2018 మున్సిపాలిటీ ఎన్నికల్లో 5వ వార్డు నుంచి విజయ డంకా మోగించారు. ప్రస్తుతం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆమె 12వార్డు నుంచి మరోసారి కౌన్సిలర్ గా గెలుపొందారు. ఆమె విజయంలో భర్త మాదినేని ప్రసాద్ కీలకపాత్ర పోషించారు. వైరా మున్సిపాలిటీ చరిత్రలో వరుసగా మూడోసారి విజయం సాధించిన మాదినేని సునీతకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
16 Feb 2026 22:09:43
మల్లాపూర్, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్టిఆర్ నగర్ బండబావి కమ్యూనిటీ హాల్లో పరమేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన...


Comments