మహిళాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం.!

మహిళాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం.!

- సత్తుపల్లి మున్సిపల్ చరిత్రలో కొత్త అధ్యాయం.
- ఎమ్మెల్యే–చైర్‌పర్సన్–వైస్ చైర్‌పర్సన్‌గా మహిళలే.

సత్తుపల్లి, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు): 

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు కీలక పదవులు దక్కడం సత్తుపల్లి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులు మహిళలకు కేటాయించడం మున్సిపాలిటీ చరిత్రలో అరుదైన పరిణామంగా నిలిచింది. మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి మైనారిటీ వర్గాలకు తగిన ప్రాధాన్యం దక్కలేదనే అభిప్రాయాల మధ్య, ఈసారి వారికి అవకాశాలు కల్పించినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. గత పదేళ్లలోనూ, అలాగే బిఆర్ఎస్ హయాంలోనూ ఇలాంటి పరిస్థితి కనిపించలేదని తెలిపారు.
ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ కష్టకాలంలో తమ వెంట నిలిచిన ఎండీ కమల్ పాషా దంపతులను గుర్తించి గౌరవప్రదమైన స్థానం కల్పించడం విశేషంగా మారింది.
ఇదే కాకుండా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవుల్లో మహిళలు బాధ్యతలు చేపట్టడం గమనార్హంగా మారింది. మున్సిపల్ చరిత్రలో తొలిసారిగా మూడు కీలక పదవుల్లో మహిళలు ఉండటం మహిళా సాధికారతకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. మహిళలకు నాయకత్వ అవకాశాలు కల్పించడం ద్వారా స్థానిక రాజకీయాల్లో కొత్త మార్పుకు శ్రీకారం చుట్టినట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మహిళాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నాయకులు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం
మల్లాపూర్, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు) ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్‌టిఆర్ నగర్ బండబావి కమ్యూనిటీ హాల్‌లో పరమేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
మూడుసార్లు వార్డు నెంబర్ గా గెలుపొందిన... మాదినేని సునీత  
వైరాను మోడల్ మున్సిపాలిటీగా   తీర్చిదిద్దుతా  బాధ్యత నాదే..
ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ
కాప్రా సర్కిల్‌లోని శ్రీ తులజా భవాని ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా
వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవిని కలిసిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు
పేద విద్యార్థికి అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం