అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎంఎంసి కమిషనర్ను కలిసిన ఎమ్మెల్యే
చర్లపల్లి, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ (ఎంఎంసి) కమిషనర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణ రెడ్డిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి చర్లపల్లి డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులను కేటాయించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.చర్లపల్లి ప్రాంతంలో రహదారుల మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, కాలనీల్లో మౌలిక వసతుల మెరుగుదల వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ అభ్యర్థనపై కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు నేమూరీ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Comments