సత్తుపల్లి వైస్‌ చైర్‌పర్సన్‌గా బొంతు సుమలత.

సత్తుపల్లి వైస్‌ చైర్‌పర్సన్‌గా బొంతు సుమలత.

- మూడో వార్డు ప్రజల విశ్వాసానికి ప్రతిఫలం.
- అభివృద్ధే లక్ష్యమన్న నూతన వైస్‌ చైర్‌పర్సన్.

సత్తుపల్లి, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు): 

సత్తుపల్లి మున్సిపాలిటీ వైస్‌ చైర్‌పర్సన్‌గా బొంతు సుమలత ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మూడో వార్డు అభ్యర్థిగా విజయం సాధించిన ఆమెను ఈ పదవికి ప్రకటించారు. ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన పార్టీ నాయకత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకత్వం అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. సత్తుపల్లిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపే దిశగా కృషి చేస్తానని, పట్టణ ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా పారదర్శకంగా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. తనపై విశ్వాసంతో గెలిపించిన మూడో వార్డు ప్రజల సేవే తనకు ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ బాధ్యతను ప్రజల ఆశీర్వాదంగా భావించి మరింత అంకితభావంతో పనిచేస్తానని నూతన వైస్‌ చైర్‌పర్సన్ బొంతు సుమలత తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం
మల్లాపూర్, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు) ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్‌టిఆర్ నగర్ బండబావి కమ్యూనిటీ హాల్‌లో పరమేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
మూడుసార్లు వార్డు నెంబర్ గా గెలుపొందిన... మాదినేని సునీత  
వైరాను మోడల్ మున్సిపాలిటీగా   తీర్చిదిద్దుతా  బాధ్యత నాదే..
ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ
కాప్రా సర్కిల్‌లోని శ్రీ తులజా భవాని ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా
వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవిని కలిసిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు
పేద విద్యార్థికి అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం