సిఆర్పిల ఆత్మీయ సమ్మేళనానికి పిలుపు.!

ఈ నెల 22న హైదరాబాద్‌లో సభ.

సిఆర్పిల ఆత్మీయ సమ్మేళనానికి పిలుపు.!

దమ్మపేట, ఫిబ్రవరి 18 (తెలంగాణ ముచ్చట్లు):

సీఆర్పీ యూనియన్ తెలంగాణ ఆధ్వర్యంలో సిఆర్పిల ఆత్మీయ సమ్మేళనం అనంతరం నిర్వహించనున్న ఏఐటీయూసీ పరిచయ–అభినందన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రంలోని సిఆర్పిలందరికీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పాడ్య నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని మినర్వా హోటల్ సమీపంలోని ముగ్దుం భవన్‌లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్‌రెడ్డి, చాడా వెంకటరెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కలవేణ శంకర్, ఎస్‌.బాలరాజు, ఎం.నరసింహ, కడారి సునీల్ పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సిఆర్పిల సమస్యల పరిష్కారం కోసం ఒక వేదికగా ఈ సమ్మేళనం కీలకమని తెలిపారు. ఏఐటీయూసీ అనుబంధ సంఘంగా ముందుకు సాగుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌లందరూ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ తరఫున కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలి పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలి
పెద్దమందడి,ఫిబ్రవరి18(తెలంగాణ ముచ్చట్లు): పదవి విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో సహజమని, అనంతరం శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసి సమాజానికి తోడ్పాటు అందించే విధంగా ముందుకు సాగాలని...
ఖిల్లా ఘనపూర్ లో పలు శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
సిఆర్పిల ఆత్మీయ సమ్మేళనానికి పిలుపు.!
నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి ఎంపీ ఈటల రాజేందర్ సన్మానం
ఘనంగా ఆలిండియా ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు
మణిగిళ్ల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం