ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి ఎంపీ ఈటల రాజేందర్ సన్మానం

ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి ఎంపీ ఈటల రాజేందర్ సన్మానం

ఉప్పల్, ఫిబ్రవరి 18 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ ప్రెస్ క్లబ్ (ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ) నూతన కమిటీ సభ్యులను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘనంగా సన్మానించారు. అధ్యక్షుడు వడ్డేపల్లి కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ సభ్యులకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, 35 సంవత్సరాల తర్వాత ఉప్పల్‌లో సీనియర్ జర్నలిస్టు వడ్డేపల్లి కిషోర్ నాయకత్వంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కలిసి ప్రెస్ క్లబ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఐకమత్యం, స్నేహబంధంతో నూతన కమిటీ సమర్థవంతంగా పని చేసి మీడియా గౌరవాన్ని మరింత పెంచాలని ఆకాంక్షించారు.మీడియా నిష్పక్షపాత ధోరణితో పనిచేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ముందుండాలని సూచించారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ చేపట్టే సేవా కార్యక్రమాలకు తన సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ బీజేపీ అధ్యక్షుడు మారినేని ఫణిందర్, ప్రధాన కార్యదర్శి తీగ విట్టల్ రావు, కోశాధికారి దువ్వాళ రమేష్, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలి పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలి
పెద్దమందడి,ఫిబ్రవరి18(తెలంగాణ ముచ్చట్లు): పదవి విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో సహజమని, అనంతరం శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసి సమాజానికి తోడ్పాటు అందించే విధంగా ముందుకు సాగాలని...
ఖిల్లా ఘనపూర్ లో పలు శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
సిఆర్పిల ఆత్మీయ సమ్మేళనానికి పిలుపు.!
నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి ఎంపీ ఈటల రాజేందర్ సన్మానం
ఘనంగా ఆలిండియా ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు
మణిగిళ్ల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం