మహాశివరాత్రి సందర్భంగా చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు
మల్లాపూర్, ఫిబ్రవరి 18 (తెలంగాణ ముచ్చట్లు):
మహాశివరాత్రి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని పరమేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాందిని క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. మల్లాపూర్ డివిజన్ ఎన్టీఆర్ నగర్ బండ భావి కమ్యూనిటీ హాల్లో జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ నాయకుడు నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ యువతను క్రీడల వైపు మళ్లించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమశిక్షణ, ఐక్యత పెంపొందుతాయని అన్నారు. క్రీడలు యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, ఇటువంటి టోర్నమెంట్లు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.25,000 నగదు బహుమతిని అందజేశారు. రన్నరప్గా నిలిచిన కుషాయిగూడ బాయ్స్ జట్టుకు రూ.15,000 ప్రైజ్ మనీని అందించి క్రీడాకారులను అభినందించారు.ఈ కార్యక్రమంలో కోయలకొండ రాజేష్, నాగి ముదిరాజ్, శివ ముదిరాజ్, రాజు ముదిరాజ్, బాబ్లు, సందీప్, వంశీ తదితరులు పాల్గొన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో నెమలి అనిల్ కుమార్ ప్రోత్సాహం ఆదర్శప్రాయమని నిర్వాహకులు పేర్కొన్నారు.


Comments