పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలి
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పెద్దమందడి,ఫిబ్రవరి18(తెలంగాణ ముచ్చట్లు):
పదవి విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో సహజమని, అనంతరం శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసి సమాజానికి తోడ్పాటు అందించే విధంగా ముందుకు సాగాలని తూడి మేఘారెడ్డి సూచించారు.బుధవారం మద్దిగట్ల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సాంఘిక శాస్త్రం)గా సేవలందించిన అశ్విని భగవంతు పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం ఉందని, సమాజ మార్పుకు గురువుల బోధనలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. అలాంటి గురువులు పదవి విరమణ అనంతరం కూడా సమాజోద్ధరణలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఉద్యోగ జీవితం ముగిసిన తర్వాత కూడా తమ సేవలతో మంచి గుర్తింపు నిలుపుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా పదవి విరమణ పొందుతున్న అశ్విని భగవంతు, రాధా దంపతులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments