నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

కీసర, ఫిబ్రవరి 18 (తెలంగాణ ముచ్చట్లు):

ఫీడర్లలో కీసర సబ్‌స్టేషన్ నిర్వహణ పనులు చేపట్టనున్నందున కీసర పరిధిలోని పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కీసర విద్యుత్ శాఖ ఏఈ ఎస్. మురళీ కృష్ణ తెలిపారు.
రాంపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు 11 కె.వి శ్రీనగర్ ఫీడర్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ సమయంలో రాంపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, చెర్లపల్లి నుండి రాంపల్లి రోడ్ వరకు, సాయి నగర్ కాలనీ, జ్యోతి కాలనీ, డీఎస్ఆర్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు.అలాగే యాద్గార్పల్లి సబ్‌స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు 11 కె.వి యాద్గార్పల్లి ఫీడర్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో యాద్గార్పల్లి గ్రామం, చితారామ్మ ఆలయం, టింబర్ డిపో, ఎస్సీ కాలనీ, రామస్వామి కాలనీ, యాద్గార్పల్లి ఏజీఎల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.అత్యవసర అవసరాల కోసం ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ శాఖ పనులకు సహకరించాలని ఏఈ ఎస్. మురళీ కృష్ణ విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలి పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలి
పెద్దమందడి,ఫిబ్రవరి18(తెలంగాణ ముచ్చట్లు): పదవి విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో సహజమని, అనంతరం శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసి సమాజానికి తోడ్పాటు అందించే విధంగా ముందుకు సాగాలని...
ఖిల్లా ఘనపూర్ లో పలు శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
సిఆర్పిల ఆత్మీయ సమ్మేళనానికి పిలుపు.!
నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి ఎంపీ ఈటల రాజేందర్ సన్మానం
ఘనంగా ఆలిండియా ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు
మణిగిళ్ల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం