సోలిపురంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే  మేఘారెడ్డి

సోలిపురంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే  మేఘారెడ్డి

ఖిల్లా ఘనపురం,ఫిబ్రవరి21(తెలంగాణ ముచ్చట్లు):

ఖిల్లా ఘనపురం మండలం సోలిపురం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సోలిపురం మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉన్నదని, దానికి అనుబంధంగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యఅధికారి సాయినాథ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సింధు శేఖర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.IMG-20260221-WA0058

Tags:

Post Your Comments

Comments

Latest News

సేవాలాల్ మార్గమే సమాజ పురోగతికి దిక్సూచి సేవాలాల్ మార్గమే సమాజ పురోగతికి దిక్సూచి
హనుమకొండ,ఫిబ్రవరి 21(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా గిరిజన భవనంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. సేవాలాల్ ఉత్సవ...
పీడిత వర్గాల సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ 
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని నాగ వైష్ణవి బంగారు పతకం
గుజ్జుల రాంగోపాల్ రెడ్డి ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
రాష్ట్ర స్థాయిలో మెరిసిన వేలేరు ఎస్సై అజ్మీర సురేష్ కుమార్ 
క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి 
వికలాంగులను గౌరవించని వారే అసలైన వికలాంగులు