గుజ్జుల రాంగోపాల్ రెడ్డి ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
వేలేరు, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన గుజ్జుల రామ్ గోపాల్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా, ఆయనను తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య మర్యాదపూర్వకంగా పరామర్శించారు.
ఆయన నివాసానికి వెళ్లి రామ్ గోపాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పీచర గ్రామ సర్పంచ్ మరిజె అనిత నరసింహారావు, మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి మారబోయిన రాజు గౌడ్, ఉప సర్పంచ్ గుడికందుల ప్రశాంత్, 4వ వార్డ్ మెంబర్ కొలిపాక వెంకటేష్, కొయ్యాడ మహేందర్, మాజీ సర్పంచ్ ఏలూరి వీరయ్య, సట్ల రవీందర్, మాజీ ఎంపిటిసి దేవరాజుల స్వరూప-జంపయ్య, మాజీ కోఆప్షన్ జానీ, ఎర్రగోళ్ల ఎల్లయ్య, అవునురి శ్యామ్, పండుగ తిరుపతి, మహమ్మద్ హరీఫ్, ఏలూరు కల్యాణ్ తదితరులు పాల్గొని పరామర్శించారు.


Comments