హెచ్ఎంటి నగర్లో సిమెంట్ రోడ్డు పనుల మాజీ కార్పొరేటర్ పర్యవేక్షించారు
రూ.10 లక్షలతో రాఘవేంద్ర నగర్ కాలనీ ఎంట్రన్స్లో అభివృద్ధి పనులు
నాచారం, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గ నాచారం సర్కిల్ హెచ్ఎంటి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ ఎంట్రన్స్ వద్ద రూ.10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ కాలనీవాసులతో కలిసి పర్యవేక్షించారు. పనులు నాణ్యతతో, సమయానికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను కార్పొరేటర్గా ఉన్న సమయంలో నాచారం ప్రాంతంలో సుమారు రూ.9 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. ఆ పనులు ప్రస్తుతం దశలవారీగా ప్రారంభమవుతున్నాయని పేర్కొన్నారు.ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి అభ్యర్థన మేరకు నాచారం రైతు బజార్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రూ.3 కోట్లు, ఎర్రగుంటలోని హిందూ స్మశానవాటికను వైకుంఠధామంగా అభివృద్ధి చేయడానికి రూ.2.90 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తికాగానే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.అలాగే హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువును రూ.30 కోట్లతో సుందరీకరించినట్లు, త్వరలోనే చెరువును ఖాళీ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మక్తాల శేఖర్ గౌడ్, సంఘం యాదగిరి, విట్టల్ యాదవ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments