విద్యుత్ భద్రతపై అప్రమత్తతే రక్షణ.

*రైతులు, వినియోగదారులకు డీఈ ఉపేందర్ కీలక సూచనలు.

హుజూరాబాద్,జూన్ 30(తెలంగాణ ముచ్చట్లు ):

విద్యుత్ వినియోగదారులు, రైతులు విద్యుత్ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కరీంనగర్ డీఈ (టెక్నికల్ అండ్ సేఫ్టీ) ఉపేందర్ సూచించారు. హుజూరాబాద్ టౌన్ పోలీస్ పరిధిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే టీజీఎస్‌పీడీసీఎల్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
విద్యుత్ శాఖ ప్రవేశపెట్టిన 'న్యూ మీటర్ స్కీమ్' వినియోగదారులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొంటూ, క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు స్వయంగా విద్యుత్ స్తంభాలు మార్చే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. విద్యుత్ లైన్లలో సాంకేతిక లోపాలు తలెత్తిన వెంటనే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
అనవసర విద్యుత్ లోడ్లను వినియోగించకుండా, నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించుకోవాలని రైతులకు సూచించారు. విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరచడంతో పాటు ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఒక్క ఓటు కూడా కోల్పోవద్దు.. ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయండి. ఒక్క ఓటు కూడా కోల్పోవద్దు.. ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయండి.
వార్డుల పర్యటనలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రణవ్ బాబు.. జమ్మికుంట టౌన్ జూన్ 30 (తెలంగాణ ముచ్చట్లు): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను...
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో దొడగుంటపల్లి నాయకులు.
సూరారంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ
తెలంగాణలో జనసేన బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుంది.
సేవకు గుర్తింపు.. జిల్లా బాధ్యతలతో శివన్నకు ఘన సన్మానం.
కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం.
విద్యుత్ భద్రతపై అప్రమత్తతే రక్షణ.