ప్రజల కష్టకాలంలో అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.

హుజూరాబాద్‌లో భారీగా సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ.

ప్రజల కష్టకాలంలో అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.

హుజూరాబాద్, జూన్ 30(తెలంగాణ ముచ్చట్లు ):

ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు, అత్యవసర అవసరాల కోసం ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సి ఎం ఆర్ ఫ్ )ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఊరటనిస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు, హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన నాయకులు, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందుల వల్ల వైద్య చికిత్సలకు దూరం కాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వేగంగా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా పనిచేస్తామని వొడితల ప్రణవ్ బాబు తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని, ప్రజా సేవే తమ ధ్యేయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, నియోజకవర్గ IMG-20260630-WA0009ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఒక్క ఓటు కూడా కోల్పోవద్దు.. ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయండి. ఒక్క ఓటు కూడా కోల్పోవద్దు.. ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయండి.
వార్డుల పర్యటనలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రణవ్ బాబు.. జమ్మికుంట టౌన్ జూన్ 30 (తెలంగాణ ముచ్చట్లు): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను...
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో దొడగుంటపల్లి నాయకులు.
సూరారంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ
తెలంగాణలో జనసేన బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుంది.
సేవకు గుర్తింపు.. జిల్లా బాధ్యతలతో శివన్నకు ఘన సన్మానం.
కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం.
విద్యుత్ భద్రతపై అప్రమత్తతే రక్షణ.