భీమదేవరపల్లి వెటర్నరీ హాస్పిటల్‌లో నూతన వైద్యాధికారిగా డాక్టర్ రోజా బాధ్యతల స్వీకరణ.

భీమదేవరపల్లి వెటర్నరీ హాస్పిటల్‌లో నూతన వైద్యాధికారిగా డాక్టర్ రోజా బాధ్యతల స్వీకరణ.

భీమదేవరపల్లి, జూన్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిలో నూతన వెటర్నరీ వైద్యాధికారిగా డాక్టర్ రోజా బాధ్యతలు స్వీకరించారు. ఆమె గతంలో కేశవపూర్ వెటర్నరీ ఆసుపత్రిలో విధులు నిర్వహించగా, బదిలీపై భీమదేవరపల్లికి వచ్చి తన కొత్త బాధ్యతలను చేపట్టారు.

ఈ సందర్భంగా డాక్టర్ రోజాకు ఆసుపత్రి సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, పశుపాలకులు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండలంలోని పశుపాలకులకు నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

పశువులకు అవసరమైన టీకాలు, చికిత్సలు, అత్యవసర వైద్య సేవలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అలాగే మండలంలోని పశుసంపద అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ రైతులు, పశుపాలకులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, స్థానిక నాయకులు, పశుపాలకులు పాల్గొని నూతన వైద్యాధికారికి అభినందనలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మానవతా హృదయాన్ని చాటిన ఎన్ఆర్ఐ కస్తూరి శ్రీధర్. మానవతా హృదయాన్ని చాటిన ఎన్ఆర్ఐ కస్తూరి శ్రీధర్.
మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి మిత్రులు  ముక్కెర గోపాల్ కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందజేత  చిల్పూర్,జూన్03(తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామానికి చెందిన...
పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించిన సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత.
భీమదేవరపల్లి వెటర్నరీ హాస్పిటల్‌లో నూతన వైద్యాధికారిగా డాక్టర్ రోజా బాధ్యతల స్వీకరణ.
నాణ్యమైన విద్యతో ప్రభుత్వ బడులపై పెరుగుతున్న విశ్వాసం.
శ్రీకర్ మొక్కజొన్న నకిలీ విత్తనాల ఆరోపణలు అవాస్తవం!
జమ్మికుంటలో హరీష్ రావు బర్త్‌డే సెలబ్రేషన్స్.. శివాలయంలో అన్నదానం.
చేప పిల్లల సరఫరాలో అక్రమాలపై ఆగ్రహం.