మహిళా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
పెబ్బేరు,మే 31(తెలంగాణ ముచ్చట్లు)
రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.ఆదివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో నిర్వహించిన చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని, వనపర్తి నియోజకవర్గంలో 37,500 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం అందజేస్తోందని తెలిపారు.అలాగే ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఉపాధి అవకాశాల కల్పన ద్వారా వారి ఆర్థిక పురోగతికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు.మహిళలను వివిధ రంగాల్లో భాగస్వాములను చేస్తూ స్వయం సమృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.మహిళల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు గుర్తిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే విమర్శలకు సమాధానం చెబుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.


Comments