కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త మృతి.. పార్టీకి తీరని లోటు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త మృతి.. పార్టీకి తీరని లోటు.

పెద్దమందడి,మే30(తెలంగాణ ముచ్చట్లు): 

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త పానుగంటి సామేలు తన స్వంత వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ నాయకుల ద్వారా బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5,000/-రూపాయలను అందజేశారు.ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, పానుగంటి సామేలు పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన నిబద్ధత కలిగిన కార్యకర్త అని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, వార్డు సభ్యులు రాములమ్మ, హనుమంతు, కావాలి కృష్ణ, నరేష్, మాజీ సర్పంచ్ సిద్ధయ్య, తిక్కన్న, రఘుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి.
వనపర్తి,మే30(తెలంగాణ ముచ్చట్లు): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమీక్షా పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, వారికి ఉపశమనం కల్పించేందుకు...
ఏసీబీ ట్రాప్ కేసులో నేలకొండపల్లి పూర్వ తహసిల్దారు  నరసింహారావుకు జైలు శిక్ష.
కోర్టు వాయిదాలకు గైర్హాజరు.. నలుగురిని హుజూరాబాద్ జైలుకు తరలింపు.
యుద్ధప్రాతిపదికన గట్ల నర్సింగాపూర్ బ్రిడ్జి నిర్మించాలి!
చిట్టీ డబ్బుల వివాదం.. యువకుడి ఆత్మహత్యాయత్నం.
మహిళల ఆర్థికాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం: చైర్మన్ దిలీప్.
పెద్దమందడి మండల కేంద్రంలో తాగునీటి సమస్య.. పట్టించుకోని అధికారులు .