నక్ష బాట సర్వే చేపట్టాలి..స్మశాన వాటిక భూమికి హద్దులు గుర్తించాలి.

సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం.

నక్ష బాట సర్వే చేపట్టాలి..స్మశాన వాటిక భూమికి హద్దులు గుర్తించాలి.

పెద్దమందడి,మే30(తెలంగాణ ముచ్చట్లు): 

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ గట్టు కాలువ నుండి అడ్డాకుల పొలిమేర వరకు ఉన్న నక్ష బాటను సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని పెద్దమందడి తహసీల్దార్‌కు శనివారం వెల్టూర్ గ్రామపంచాయతీ తరఫున గ్రామ సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.గ్రామ ప్రజల అవసరాలు, భూసరిహద్దుల స్పష్టత దృష్ట్యా గట్టు కాలువ నుండి అడ్డాకుల పొలిమేర వరకు ఉన్న నక్ష బాటను సంబంధిత అధికారులు సర్వే చేసి శాశ్వత హద్దులు ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు.అదేవిధంగా గట్టు కాలువ నుండి తోలబండ వరకు ఉన్న 21వ సర్వే నంబరులోని అసైన్డ్ భూమిని గ్రామ స్మశాన వాటికకు కేటాయించి, ఆ భూమికి హద్దులు గుర్తించాలని తహసీల్దార్‌ను కోరారు.గ్రామాభివృద్ధి, ప్రజల సౌకర్యాల దృష్ట్యా ఈ రెండు అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, గోవర్ధన్ రెడ్డి, ముష్టి శ్రీనివాసులు, వివేక్, యాదయ్య, సత్య రెడ్డి, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి.
వనపర్తి,మే30(తెలంగాణ ముచ్చట్లు): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమీక్షా పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, వారికి ఉపశమనం కల్పించేందుకు...
ఏసీబీ ట్రాప్ కేసులో నేలకొండపల్లి పూర్వ తహసిల్దారు  నరసింహారావుకు జైలు శిక్ష.
కోర్టు వాయిదాలకు గైర్హాజరు.. నలుగురిని హుజూరాబాద్ జైలుకు తరలింపు.
యుద్ధప్రాతిపదికన గట్ల నర్సింగాపూర్ బ్రిడ్జి నిర్మించాలి!
చిట్టీ డబ్బుల వివాదం.. యువకుడి ఆత్మహత్యాయత్నం.
మహిళల ఆర్థికాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం: చైర్మన్ దిలీప్.
పెద్దమందడి మండల కేంద్రంలో తాగునీటి సమస్య.. పట్టించుకోని అధికారులు .