బైక్ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.. ఆలస్యంగా ఫిర్యాదు.

జమ్మికుంట టౌన్ మే 16 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మండల పరిధిలోని మడిపల్లి గ్రామానికి చెందిన గర్రెపల్లి శ్రీనాథ్ తండ్రి సత్యనారాయణ(25), తన తమ్ముడు గర్రెపల్లి ఉదయ్ కిరణ్(24) ప్రమాదానికి గురైనట్లు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. మే 2, 2026న సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో ఉదయ్ కిరణ్ తన ద్విచక్ర వాహనంపై పనిమీద జమ్మికుంటకు వస్తుండగా, బొమ్మల గుడి వద్దకు చేరుకున్న సమయంలో వెనుక నుండి సుదర్శన్ అనే వ్యక్తి తన బైక్‌ను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వచ్చి ఢీకొట్టినట్లు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఉదయ్ కిరణ్ కిందపడిపోగా కుడి కాలి కింద నరాలు తెగడంతో పాటు శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం ఆలస్యమైనట్లు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవ ఎన్నిక. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవ ఎన్నిక.
ఖమ్మం బ్యూరో, మే 16(తెలంగాణ ముచ్చట్లు ) మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు సంఘం జిల్లా...
విధుల్లో కఠినత్వం.. క్రీడల్లో స్వర్ణ విజయం : ఏసిపి మాధవి
రెండు వారాలు గడిచినా ధాన్యం డబ్బులు లేవు… ఐకేపీ సెంటర్ నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం.
పల్లెకు వెళ్లొస్తా” అన్న భద్రయ్య.. మృతదేహంగా తిరిగొచ్చాడు.
బైక్ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.. ఆలస్యంగా ఫిర్యాదు.
సలీం సేవలను కాంగ్రెస్ ఎప్పటికీ మరవదు : తాజుద్దీన్
డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం : సొల్లు బాబు