బైక్ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.. ఆలస్యంగా ఫిర్యాదు.
Views: 2
On
జమ్మికుంట టౌన్ మే 16 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండల పరిధిలోని మడిపల్లి గ్రామానికి చెందిన గర్రెపల్లి శ్రీనాథ్ తండ్రి సత్యనారాయణ(25), తన తమ్ముడు గర్రెపల్లి ఉదయ్ కిరణ్(24) ప్రమాదానికి గురైనట్లు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. మే 2, 2026న సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో ఉదయ్ కిరణ్ తన ద్విచక్ర వాహనంపై పనిమీద జమ్మికుంటకు వస్తుండగా, బొమ్మల గుడి వద్దకు చేరుకున్న సమయంలో వెనుక నుండి సుదర్శన్ అనే వ్యక్తి తన బైక్ను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వచ్చి ఢీకొట్టినట్లు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఉదయ్ కిరణ్ కిందపడిపోగా కుడి కాలి కింద నరాలు తెగడంతో పాటు శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం ఆలస్యమైనట్లు పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
16 May 2026 21:28:51
ఖమ్మం బ్యూరో, మే 16(తెలంగాణ ముచ్చట్లు )
మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు సంఘం జిల్లా...


Comments