మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆర్థిక చేయూత.
Views: 2
On
పెద్దమందడి,మే14(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామంలో అనారోగ్య కారణాలతో వడ్డే పెద్ద బాలస్వామి, బర్ల మల్లయ్య మృతి చెందడంతో కాంగ్రెస్ నాయకులు శ్రీశైలం కార్యకర్తలతో కలిసి గురువారం వారి కుటుంబాలను పరామర్శించారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తరఫున మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తక్షణ సహాయంగా ఒక్కో కుటుంబానికి రూ.5000/- వేల ఆర్థిక సహాయం అందజేశారు.బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మధిర శ్రీశైలం, ఉప సర్పంచ్ రాములమ్మ హనుమంతు, వార్డు సభ్యులు కొంకలి నరేష్, కావలి కృష్ణ, నాయకులు కొంకల్లి నరసింహ, లక్ష్మారెడ్డి, సిద్దు, చందు, షౌకత్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 May 2026 22:06:48
రోడ్డు ప్రమాద బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించాలిమెడికవర్ వైద్యులు రాజీవ్ రెడ్డి, వేణుగోపాల్ సూచనలు*
హుజురాబాద్, మే 15(తెలంగాణ ముచ్చట్లు ):
రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రమాదం...


Comments