అనారోగ్యంతో మహిళ మృతి.. ముదిరాజ్ సొసైటీ తరఫున రూ.10 వేల ఆర్థిక సహాయం.
Views: 3
On
పెద్దమందడి,మే12(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన గొర్రె వెంకటమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలి కుటుంబ సభ్యులను ముదిరాజ్ సొసైటీ నాయకులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా ముదిరాజ్ సొసైటీ తరఫున మృతురాలి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం సమాజ బాధ్యత అని సొసైటీ సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, గొర్రె కొండన్న, అడివన్న, గొర్రె వెంకటయ్య, గొర్రె సతీష్, గొర్రె కురుమయ్య, మార్చే నాగరాజ్, దండు నరసింహ, దండు యాదగిరి, మార్చే సాయిలు, గొర్రె సత్యన్న పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
12 May 2026 21:51:43
*సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్*
*మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దంటూ హెచ్చరిక*
*ప్రజల భద్రతే మా బాధ్యత*
మంచిర్యాల,మే12 (తెలంగాణ ముచ్చట్లు)
మందమర్రి మండలం సారంగపల్లి గ్రామంలో...


Comments