జమ్మికుంటలో గుర్తుతెలియని వ్యక్తి మృతి.. వడదెబ్బ అనుమానం.
Views: 2
On
జమ్మికుంట టౌన్ మే 08 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ ఏరియాలో గల వాటర్ ట్యాంక్ సమీపంలో గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఉదయం సుమారు 7 గంటల సమయంలో రోడ్డుపై ఓ వ్యక్తి మృతి చెందిన స్థితిలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిగా గుర్తించారు. స్థానికుల వివరాల ప్రకారం, అతను గత 15 రోజులుగా జమ్మికుంటలో లేబర్ పని చేస్తూ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు తెలిసింది.
బుధవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో సూపర్ డ్రెస్సెస్ షాప్ ముందు అతను పడుకొని ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల నమోదవుతున్న తీవ్ర ఎండల
నేపథ్యంలో వడదెబ్బ తగిలి అతను మృతి చెందినట్టుగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
నేపథ్యంలో వడదెబ్బ తగిలి అతను మృతి చెందినట్టుగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
09 May 2026 17:27:53
- ఎమ్మెల్యే మట్టా రాగమయికి వినతిపత్రం.
- ఐదు మండలాల వీఓఏల డిమాండ్.
సత్తుపల్లి, మే 9(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్రంలోని వీఓఏల సమస్యల పరిష్కారం కోరుతూ...


Comments