హైకోర్టు ఆదేశాలతో పాత బోర్డు పునరాగమనం .
సింగిల్ విండో చైర్మన్గా కుండాల్ రెడ్డి బాధ్యతలు స్వీకారం.
Views: 3
On
హుజురాబాద్ మే 5(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్లో సింగిల్ విండో చైర్మన్గా కుండాల్ రెడ్డి మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. పాత పాలకవర్గానికి తిరిగి అధికార బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో పాత పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో సీఈవో గోస్కుల వివేకానంద ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరిగింది. సిబ్బంది మహేందర్ రెడ్డి, విజయ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
హైకోర్టు నిర్ణయంతో పాత పాలకవర్గం తిరిగి బాధ్యతలు చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 May 2026 22:32:34
జమ్మికుంట టౌన్ మే 05 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ పరిధిలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పలు వార్డులను సందర్శించి శానిటేషన్ పనులను...


Comments