జమ్మికుంటలో ఘనంగా ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర.
Views: 3
On
జమ్మికుంట టౌన్ మే 05 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. శంకర్ నందన గార్డెన్స్ నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్రను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ సేవాసమితి మరియు బ్రదర్స్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శోభాయాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. శ్రీ హనుమాన్ స్వామి ఆశీస్సులతో జమ్మికుంట పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
అలాగే హనుమాన్ భక్తులు, హిందూ బంధువులు, యువకులు మరియు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ, ఎస్ఐతో పాటు అనేక మంది భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.
జమ్మికుంట పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. శంకర్ నందన గార్డెన్స్ నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్రను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ సేవాసమితి మరియు బ్రదర్స్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శోభాయాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. శ్రీ హనుమాన్ స్వామి ఆశీస్సులతో జమ్మికుంట పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
అలాగే హనుమాన్ భక్తులు, హిందూ బంధువులు, యువకులు మరియు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ, ఎస్ఐతో పాటు అనేక మంది భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 May 2026 22:32:34
జమ్మికుంట టౌన్ మే 05 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ పరిధిలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పలు వార్డులను సందర్శించి శానిటేషన్ పనులను...


Comments