ఎస్సీ అట్రాసిటీ బాధితులకు వెంటనే పారితోషికాలు.
కలెక్టర్ ఆదర్శ సురభికి వినతిపత్రం అందజేత.
Views: 3
On
-- ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు భోజరాజు
వనపర్తి,మే04(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లాలోని ఎస్సీ అట్రాసిటీ కేసుల బాధితులకు ఇప్పటివరకు అందని పారితోషికాలను వెంటనే విడుదల చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి కు వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరియు జాతీయ మాలల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు మాదారి భోజరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మద్దెల కర్ణాకర్, కార్యవర్గ సభ్యులు బండారు రాజకుమార్, బీజ్జా ఆంజనేయులు, కురిటీ రమేష్ పాల్గొన్నారు. వినతిపత్రాన్ని స్వీకరించిన కలెక్టర్ సమస్యపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 May 2026 17:01:04
ఎల్కతుర్తి, మే 5( తెలంగాణ ముచ్చట్లు):
ప్రజాపాలన ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా దండేపల్లి గ్రామంలో నిర్వహించిన “రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం రైతుల్లో కొత్త...


Comments