ప్రజల సహకారంతోనే సెన్సెస్ విజయవంతం.

జిల్లా డిప్యూటీ గణాంక అధికారి.

ప్రజల సహకారంతోనే సెన్సెస్ విజయవంతం.

జమ్మికుంట టౌన్ మే 04 (తెలంగాణ ముచ్చట్లు): 
 
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెన్సెస్ నమోదు కార్యక్రమం పూర్తి చేయడంలో ప్రజల సహకారం ఎంతో కీలకమని జిల్లా డిప్యూటీ గణాంక అధికారి కిషన్ రావు తెలిపారు.
సోమవారం ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ చివరి రోజు సందర్భంగా, మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో శిక్షణ జరుగుతున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సెన్సెస్‌లో పేర్కొన్న అన్ని వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే నిర్వహించాలని, అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు సర్వేను పూర్తిచేసి సమర్పించాలని తెలిపారు.
టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీధర్, టిపిఎస్ రాజ్‌కుమార్, టిపిబివో దీపికల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి సందేహాలు వచ్చిన వెంటనే నివృత్తి చేసుకొని, పూర్తి వివరాలు నమోదు చేయాలని ఎన్యూమరేటర్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.IMG-20260504-WA0078
Tags:

Post Your Comments

Comments

Latest News

సేంద్రియ సాగుతో భూమికి శక్తి  రైతుల భవిష్యత్తుకు భరోసా. సేంద్రియ సాగుతో భూమికి శక్తి  రైతుల భవిష్యత్తుకు భరోసా.
ఎల్కతుర్తి, మే 5( తెలంగాణ ముచ్చట్లు):    ప్రజాపాలన ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా దండేపల్లి గ్రామంలో నిర్వహించిన “రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం రైతుల్లో కొత్త...
మహిళలకు స్వయం ఉపాధి దిశగా మినీ డైరీ యూనిట్లు.
గీత కార్మికుల చేత శీలం అనిల్ కుమార్ దంపతులకు ఘన సన్మానం.
ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయం..
వంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
నకిలీ పత్రాల ఫోర్జరీ కేసులో నిందుతుడు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు.
క్లబ్‌పై ఆడిటింగ్ జరపాలి..