పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డికి ఘన వీడ్కోలు.

పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డికి ఘన వీడ్కోలు.

పెద్దమందడి,మే02( తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం శనివారం పెద్దమందడి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, రైతులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై జగదీశ్వర్ రెడ్డిని ఘనంగా సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జగదీశ్వర్ రెడ్డి తన ఉద్యోగ జీవితంలో నిజాయితీ, క్రమశిక్షణ, సేవా భావంతో పనిచేసి రైతులకు అందుబాటులో ఉంటూ సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. రైతు సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, సహనంతో వ్యవహరించిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
సింగిల్ విండో అభివృద్ధి, రైతులకు అవసరమైన సేవలు అందించడంలో జగదీశ్వర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, సహచర ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందారని నాయకులు తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
తనకు సహకరించిన ప్రజాప్రతినిధులు, రైతులు, సహచర సిబ్బందికి జగదీశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో అందరి సహకారంతోనే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలిగానని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రాణాలకు ముప్పు… హుజురాబాద్ వద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్‌కు గట్టి వ్యతిరేకం. ప్రాణాలకు ముప్పు… హుజురాబాద్ వద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్‌కు గట్టి వ్యతిరేకం.
హుజురాబాద్, మే 2(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ పట్టణానికి సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని వేస్ట్...
పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణం.
పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.!
పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డికి ఘన వీడ్కోలు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం.
వేలేరు మండల కేంద్రంలో ఘనంగా మే డే వేడుకలు.
ప్రపంచ కార్మికులారా ఏకంకండి నినాదాలతో మేడే.