డంపింగ్ యార్డ్పై అగ్గిరాజేసిన నిరసనలు.
_అర్ధనగ్న దీక్షతో హుజురాబాద్ హోరెత్తింది.
Views: 7
On
.హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్ శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రజా పోరాటం రోజురోజుకు ఉధృతమవుతోంది. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్ష ఆదివారం 29వ రోజుకు చేరుకుని కొత్త మలుపు తిరిగింది.
ఈ క్రమంలో మండల, పట్టణ సోషల్ మీడియా వారియర్స్ ముందుకొచ్చి అంబేద్కర్ చౌరస్తా వద్ద అర్ధనగ్న దీక్ష చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వినూత్న నిరసనతో ప్రాంతం మొత్తం ఒక్కసారిగా కదిలిపోయింది.
నిరసనకారులు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను రద్దు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. “ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దు” అంటూ నినాదాలతో చౌరస్తా మార్మోగింది.
ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిస్తూ, ఈ ప్రాజెక్టు వల్ల పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ నిరసనలో యువత, స్థానికులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతను ప్రదర్శించారు. డంపింగ్ యార్డ్ అంశం ఇప్పుడు హుజురాబాద్లో హాట్ టాపిక్గా మారింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments